Webdunia - Bharat's app for daily news and videos

Install App

భువనగిరిలో 'కారు'ను 'రోలర్' తొక్కేసింది : హరీశ్ రావు

Webdunia
సోమవారం, 27 మే 2019 (16:15 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లకు కూడా ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నెల23వ తేదీన వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస 9 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు, ఎంఐఎం ఒకటి చొప్పున సీట్లు కైవసం చేసుకున్నారు. అయితే, తెరాస కంచుకోటల్లో ఒక్కటైన కరీంనగర్, భువనగిరి, నిజామాబాద్, అదిలాబాద్ స్థానాల్లో తెరాస చిత్తుగా ఓడిపోయింది. 
 
ముఖ్యంగా నిజామాబాద్‌లో తెరాస రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె.కవిత కూడా ఓడిపోయారు. అలాగే భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. ఆయన తెరాస అభ్యర్థి బోరా నర్సయ్య గౌడ్ ఓడిపోయారు. 
 
అయితే, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి ఏకంగా 27 వేల ఓట్లు వచ్చాయి. ఈయన రోలర్ గుర్తుపై పోటీ చేశారు. దీనిపై తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు స్పందించారు. భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో కారును రోలర్ తొక్కేసిందని అందువల్ల ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఈ ఎన్నికల్లో ఓడిపోయినంతమాత్రాన కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments