Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌లో చేరనున్నటీఆర్ఎస్ నేత, చెరుకు శ్రీనివాస్ రెడ్డి

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (14:06 IST)
టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రంస్ పార్టీలో చేరనున్నారు. తండ్రి ముత్యం రెడ్డితో కలిసి 2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌లో చేరిన శ్రీనివాస్ రెడ్డి కొన్నాళ్లుగా ఆ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు.
 
దుబ్బాక నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని టీపీసీసీ శ్రీనివాస్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్‌లో చేరారు.
 
ముత్యం రెడ్డికి రాష్ట్రస్థాయి కార్పోరేషన్ పదవి ఇస్తామని కేసీఆర్ ఆ సమయంలో హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎన్నికల అనంతరం ముత్యం రెడ్డి అనారోగ్యంతో కన్ను మూసారు. అప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డిని పెద్దగా టీఆర్ఎస్ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా దూరంగా పెడుతున్నారని ఆయన వర్గంలో అసంతృప్తి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments