Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్, బీజేపీ నేతల దాడులు.. రాళ్లు, కర్రలు విసురుకున్నారు

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (17:36 IST)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. రెండో రోజు టీఆర్ఎస్, బీజేపీ నేతలు దాడులు చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల ఐకేపీ సెంటర్‌లో వడ్ల కొనుగోళ్లను పరిశీలించేందుకు సంజయ్ వెళ్లగా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు రాళ్లు, చెప్పులు, కర్రలు విసురుకున్నారు. 
 
అర్వపల్లి దగ్గర పోలీసులపైకి దూసుకెళ్లారు టీఆర్ఎస్ కార్యకర్తలు. కర్రలతో పోలీసులపై దౌర్జన్యం చేశారు. తమనే అడ్డుకుంటారా అంటూ కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారు. పోలీసులను అక్కడ్నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో అక్కడ చాలాసేపు ఉద్రిక్త పరిస్తితి ఏర్పడింది. ముగ్గురు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. వాళ్లను వెంటనే  పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. 
 
బండి సంజయ్ పర్యటన సందర్బంగా ఆత్మకూరు మండలం కొనుగోలు కేంద్రం వద్ద  విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ ఇనస్పెక్టర్ సీఐ శ్రీనివాస్‌ అస్వస్థతకు గురయ్యారు. సూర్యపేట ఆస్పత్రిలో శ్రీనివాస్ కు చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments