ట్రైనీ ఐఏఎస్‌పై లైంగిక వేధింపుల కేసు ... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (11:47 IST)
మహిళలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిలో ఐఏఎస్, ఐపీఎస్‌లు సైతం ఉన్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ ట్రైనీ ఐఏఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ యువతి ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు. ఆ ట్రైనీ ఐఏఎస్ అధికారి పేరు బానోతు మృగేందర్‌లాల్ (30). 
 
ఈయనపై హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐఏఎస్ ప్రస్తుతం తమిళనాడులోని మదురైలో శిక్షణలో ఉన్నారు. మృగేందర్‌లాల్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో శిక్షణ పొందిన సమయంలో కూకట్‌పల్లికి చెందిన యువతి (25)తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
 
ఈ క్రమంలో ఓ రోజు యువతి తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను బయటకు తీసుకెళ్లి ఆయన స్నేహితులతో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. అపుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ విషయం తెలిసిన మృగేందర్ లాల్ తండ్రి అయిన టీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్, తల్లి కలిసి తనను బెదిరించడంతో మిన్నకుండిపోయినట్టు తెలిపింది. ఈ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం