Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైనీ ఐఏఎస్‌పై లైంగిక వేధింపుల కేసు ... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (11:47 IST)
మహిళలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిలో ఐఏఎస్, ఐపీఎస్‌లు సైతం ఉన్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ ట్రైనీ ఐఏఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ యువతి ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు. ఆ ట్రైనీ ఐఏఎస్ అధికారి పేరు బానోతు మృగేందర్‌లాల్ (30). 
 
ఈయనపై హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐఏఎస్ ప్రస్తుతం తమిళనాడులోని మదురైలో శిక్షణలో ఉన్నారు. మృగేందర్‌లాల్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో శిక్షణ పొందిన సమయంలో కూకట్‌పల్లికి చెందిన యువతి (25)తో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
 
ఈ క్రమంలో ఓ రోజు యువతి తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను బయటకు తీసుకెళ్లి ఆయన స్నేహితులతో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. అపుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఈ విషయం తెలిసిన మృగేందర్ లాల్ తండ్రి అయిన టీఆర్ఎస్ నేత, వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్, తల్లి కలిసి తనను బెదిరించడంతో మిన్నకుండిపోయినట్టు తెలిపింది. ఈ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం