Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీడబ్ల్యూసీ సమావేశం.. హైదరాబాదుకు కాంగ్రెస్ అగ్రనేతలు

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (16:04 IST)
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పార్టీ అగ్రనేతలు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. అగ్రనేతలంతా కలిసి నగరానికి చేరుకుని నేరుగా సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్న తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు. 
 
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గే, గాంధీ దంపతులకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర నేతలు. కొత్తగా ఏర్పాటైన సీడబ్ల్యూసీ తొలి సమావేశం మధ్యాహ్నం ప్రారంభమైంది.
 
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మినహా సీడబ్ల్యూసీ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని చర్చించి, రూపొందించనున్నారు.
 
 అన్నీ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఆదివారం సీడబ్ల్యూసీ విస్తృత సమావేశం నిర్వహించనుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ శివార్లలో మెగా బహిరంగ సభ జరగనుంది. ఇందులో పార్టీ అగ్రనేతలు ప్రసంగించనున్నారు. తెలంగాణకు సంబంధించిన ఆరు హామీలను ఆ పార్టీ బయటపెడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments