Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీడబ్ల్యూసీ సమావేశం.. హైదరాబాదుకు కాంగ్రెస్ అగ్రనేతలు

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (16:04 IST)
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పార్టీ అగ్రనేతలు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. అగ్రనేతలంతా కలిసి నగరానికి చేరుకుని నేరుగా సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్న తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకున్నారు. 
 
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గే, గాంధీ దంపతులకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర నేతలు. కొత్తగా ఏర్పాటైన సీడబ్ల్యూసీ తొలి సమావేశం మధ్యాహ్నం ప్రారంభమైంది.
 
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మినహా సీడబ్ల్యూసీ సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని చర్చించి, రూపొందించనున్నారు.
 
 అన్నీ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో ఆదివారం సీడబ్ల్యూసీ విస్తృత సమావేశం నిర్వహించనుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ శివార్లలో మెగా బహిరంగ సభ జరగనుంది. ఇందులో పార్టీ అగ్రనేతలు ప్రసంగించనున్నారు. తెలంగాణకు సంబంధించిన ఆరు హామీలను ఆ పార్టీ బయటపెడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments