తెలంగాణాలో నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (07:12 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిలు జరిగాయి. స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్‌ జిల్లాలో రెండు స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం చేపట్టనున్నారు. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 
 
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలలోపు పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులను అధిక సంఖ్యలో బందోబస్తుగా నియమించారు. 
 
మరోవైపు, కరీంనగర్‌లోని 2 స్థానాకు 10 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇక్కడే అధికార తెరాస అభ్యర్థులకు గట్టిపోటీ ఎదురవుతుంది. దీంతో ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments