Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్ దగ్గరలో పులి సంచారం

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (22:30 IST)
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పులి సంచరించిన వార్తలు కలకలం రేపాయి. తాజాగా వరంగల్ ఇలాఖాలో కూడా పులి పాద ముద్రల్ని అధికారులు గుర్తించారు.

మరోసారి పులి సంచరిస్తున్న వార్తలు వినవస్తున్నాయి వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండల పరిధి పాకాల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు.

పులి వెళ్లిన ప్రాంతంలో పాద ముద్రలను సేకరించి సంచరిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. కొద్ది రోజులుగా మహబూబాబాద్ జిల్లా పరిధి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు పాకాల అటవీ ప్రాంతానికి వచ్చినట్లుగా గుర్తించారు. 

ఖానాపురం మండలంలోన బండమీది మామిడితండా శివారు అటవీ ప్రాంతంలో పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. సమీప ప్రాంతాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చిరుతపులులు అక్కడక్కడా జనావాసంలోనికి వచ్చి ప్రజలను భయందోళనలకు గురిచేస్తున్నాయి.

మొన్నటికి మొన్న మంచిర్యాల, కొమురంభీం జిల్లాలతో పాటు హైదరాబాదు నగర ప్రజలను భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments