తెలంగాణాకు మరో మూడు వారాలు వర్ష సూచన - ఆరెంజ్ హెచ్చరిక

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (11:39 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులోభాగంగా, గురు, శుక్రవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుంది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే, వచ్చే మూడు వారాల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అంటే ఈ నెల 25వ తేదీ వరకు వర్ష సూచన ప్రభావం ఎలా ఉంటుందనే అంచాలను తాజాగా వెల్లడించింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు వారాల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిజానికి నైరుతి రుతపవనాల సీజన్‌లో నమోదు కావాల్సిన వర్షపాతం మూడింట రెండు వంతుల మేర ఒక్క నెలలోనే కురిసింది. దీంతో చెరువులు, కుంటలు చాలా వరకు నిండిపోయాయి. 
 
వాగులు, వంకలతోపాటు కృష్ణా, గోదావరి ప్రధాన నదులు, ఉప నదుల్లోనూ ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ భారీ వర్షాలు పడితే.. వరదలతో జన జీవనానికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అందువల్ల ప్రభుత్వ యంత్రాంగం వానల తీవ్రతను బట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: మార్కెటింగ్ నా చేతుల్లో లేదు, ఇండియా గర్వపడే సినిమాగా బైకర్ :శర్వా

Soumith Rao: మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలవే రాబోతుంది

VK Naresh: క్రేజీ కల్యాణం నుంచి పర్వతాలు పాత్రలో వీకే నరేష్

Megastar Chiranjeevi: మన శంకర వర ప్రసాద్ గారు విజయంపై చిరంజీవి ఎమోషనల్ మెసేజ్

ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు: మన శంకరవరప్రసాద్ గారు చిత్రంపై మెగాస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో లేయర్స్ ప్రైవ్‌ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

తర్వాతి కథనం
Show comments