Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. వరుసగా మూడు రోజులు సెలవులు

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (12:21 IST)
తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శుక్రవారం నుంచి వరుసగా మాడు రోజులు సెలవులు వచ్చాయి. శుక్రవారం జమాతుల్ వాద నేపథ్యంలో ఆప్షనల్ హాలిడేను ప్రకటించారు. దీంతో హైదరాబాద్ నగరంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం పాఠశాలలు మూసివేశారు. శనివారం రంజాన్ పండుగ కావడంతో జాతీయ సెలవు దినం. ఆదివారం వారాంతపు సెలవు. దీంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. 
 
ఏపీ ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గతంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించలేక పోవడంతో ఇంటర్ మార్కుల వెయిటేజీని గతంలో తొలగించారు. ఈ యేడాది అన్ని వార్షిక పరీక్షలను సాఫీగా నిర్వహించారు. దీంతో 25 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నారు. ఎంసెట్‌లో వచ్చే మార్కుల్లో 75, ఇంటర్‌ మార్కుల్లో 25 శాతం కలిపి ఎంసెట్ ర్యాంకులను కేటాయిస్తారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments