Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనల విలువ రూ. 600 కోట్లు, ఎంత వసూలు చేస్తారంటే?

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (11:44 IST)
ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు ఉపశమనంగా, పెండింగ్ బకాయిలన్నింటినీ వసూలు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ చలాన్‌పై కోత విధించాలని ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై నగర ట్రాఫిక్ పోలీసులతో కలిసి సమీక్ష నిర్వహించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, గత ఎనిమిదేళ్లుగా ట్రాఫిక్ ఉల్లంఘించిన వారి నుంచి దాదాపు రూ.600 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.

 
మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో ప్రజల ఆర్థిక అస్థిరతను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ట్రాఫిక్ పోలీసులు పెండింగ్‌లో ఉన్న చలాన్‌లపై వాహనదారులకు తగ్గింపును అందించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నివేదికను ట్రాఫిక్ పోలీసులు డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆమోదం కోసం పంపారు. అయితే, డీజీపీ సెలవులో ఉన్నందున, ఆయన కార్యాలయంలో చేరిన తర్వాత నివేదిక ఆమోదం పొందే అవకాశం ఉంది.
 
 
ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలపై 75 శాతం, కార్లపై 50 శాతం, ఆర్టీసీ బస్సులపై 30 శాతం సబ్సిడీని అందజేస్తున్నట్లు సమాచారం. ట్రాఫిక్ ఉల్లంఘించినవారు ఆన్‌లైన్ లేదా మీ-సేవా కేంద్రాల ద్వారా బకాయిలను చెల్లించవచ్చు. ఐతే ట్రాఫిక్ చలాన్లపై కోతకు అధికారులు ఆమోదం తెలపలేదని, అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments