అప్పు తీర్చలేదని భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (15:45 IST)
లాక్‌డౌన్ వేళ తెలంగాణ‌, భ‌ద్రాద్రి జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. డ‌బ్బు పిచ్చి త‌ల‌కెక్కిన ఓ వ‌డ్డీ వ్యాపారి దాష్టీకం ప్ర‌ద‌ర్శించాడు. తీసుకున్న అప్పు స‌కాలంలో తీర్చ‌లేద‌న్న కోపంతో ఆ కుటుంబంపై క‌క్ష‌సాధింపుకు పాల్ప‌డ్డాడు.

వివ‌రాల్లోకి వెళితే…భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా టేకులప‌ల్లిలోని సులాన‌గ‌ర్‌కు చెందిన అజ్మీరా హ‌ట్యా అనే వ్య‌క్తి అదే గ్రామానికి చెందిన బానోత్ హ‌న్మా అనే వ‌డ్డీ వ్యాపారి వ‌ద్ద గ‌తంలో రూ. 2ల‌క్ష‌లు అప్పుగా తీసుకున్నాడు. 

అందులో ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు తిరిగి చెల్లించేశాడు. కాగా, మ‌రో రూ. 50వేలు మాత్రం చెల్లించాల్సి ఉంది. ఇంత‌లోనే క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ కార‌ణంగా మిగిలిన అస‌లు, వ‌డ్డీ చెల్లించేదుకు వ‌డ్డీ వ్యాపారిని గ‌డువు కోరాడు అజ్మీరా.

అందుకు అంగీక‌రించ‌ని వ‌డ్డీ వ్యాపారి అప్పు మొత్తం తీర్చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు. ఈ క్ర‌మంలో బాధితుడిపై దాడికి పాల్ప‌డ్డాడు.

అడ్డుప‌డిన అత‌డి భార్య‌ను త‌న‌తో పాటే ఇంటికి లాక్కెళ్లి నిర్భందించిన‌ట్లుగా బాధితుడు అజ్మీరా పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు టేకులపల్లి పోలీసులు హన్మాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments