పెళ్లి విందులో కోడికూర వడ్డించలేదని గొడవ... ఆగిన పెళ్లి

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (08:50 IST)
పెళ్లి విందులో చికెన్ కర్రీ వడ్డించలేని వరుడి స్నేహితులు గొడవపెట్టుకున్నారు. దీంతో శుభమా అంటూ జరగాల్సిన ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జగద్గరిగుట్టి రింగ్ బస్తీకి చెందిన యువకుడి, కుత్బుల్లాపూర్‍‌కు చెందిన యువతికి ఇటీవల వివాహం నిశ్చమైంది. షాపూర్ నగరులోని ఓ ఫంక్షన్ హాలులో సోమవారం ఉదయం వివాహం జరగాల్సివుంది. 
 
అయితే, ఆదివారం రాత్రి ఆడపెళ్లివారు విందు భోజనం ఏర్పాటు చేశారు. వధువుది బీహార్‌కు చెందిన మార్వాడి కుటుంబం కావడంతో వారు పూర్తిగా శాఖాహార భోజనాన్ని మాత్రమే వడ్డించారు. 
 
ఇక విందు ముగుస్తుందన్న సమయంలో వరుడు తరపు స్నేహితులు భోజనాలకు వచ్చారు. అక్కడున్న శాఖాహార వంటలు చూసి చికెన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించి, వధువు తరపు వారితో గొడవకు దిగి, అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ వివాదం కాస్త పెద్దదై ఇరు కుటుంబాల మధ్య గొడవకు కారణమైంది. 
 
దీంతో సోమవారం జరగాల్సిన వివాహం కాస్త రద్దు అయింది. ఈ వ్యవహారం కాస్త పోలీసుల వద్దకు వెళ్లింది. వారు ఇరు కుటుంబాల సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆగిపోయిన పెళ్లి బుధవారం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments