Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వృద్ధ దంపతులు రోడ్లు బాగు చేస్తుంటే మీకెందుకు జీతాలు: GHMCపై హైకోర్టు

Webdunia
బుధవారం, 14 జులై 2021 (21:40 IST)
గంగాధర్ తిలక్ దంపతులు రోడ్లపై గుంతలను పూడుస్తున్న అంశంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఫించను డబ్బుతో తిలక్ దంపతులు గుంతలు పూడుస్తున్నారన్న మీడియాలో కథనంపై విచారణ చేసింది. వృద్ధ దంపతులు రోడ్లు మరమ్మతులు చేస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించింది.
 
రోడ్ల దుస్థితి చూడలేక వృద్ధ దంపతులు నడుం బిగించడం జీహెచ్ఎంసీకి సిగ్గుచేటని, జీహెచ్ఎంసీ అధికారుల వేతనాలను తిలక్ దంపతులకు ఇవ్వడం మేలని అభిప్రాయపడింది. పనిచేయనప్పుడు జీహెచ్ఎంసీకి బడ్జెట్ తగ్గించడం మంచిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
 
ప్రమాదాల్లో ప్రాణాలు పోతుంటే.. వాహనాలు దెబ్బతింటుంటే చూస్తూ కూర్చున్నారా? అంటూ ప్రశ్నించింది. నగరంలో అద్భుతమైన రోడ్లను నిర్మిస్తున్నామని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది చెప్పగా, రోడ్లపై గుంతలే లేవా.. న్యాయవాదులతో తనిఖీలు చేయించమంటారా అంటూ ప్రశ్నించింది.
 
వర్షాకాలంలో దెబ్బతినే రోడ్ల మరమ్మత్తు కోసం ప్రణాళికలేంటని జీహెచ్ఎంసీని ప్రశ్నించిన హైకోర్టు, జోన్ల వారీగా జోనల్ కమిషనర్లు, ఎస్ఈలు నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం