Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహ్మాద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలు.. ఛార్మినార్‌ వద్ద ఉద్రిక్తత

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (23:05 IST)
మహ్మాద్‌ ప్రవక్తపై నుపూర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ చేసిన వ్యాఖ‍్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది.
 
శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలు ఆందోళనకు దిగారు. మహ్మద్‌ ప్రవక్తపై మాజీ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు నినాదాలు చేస్తూ మక్కా మసీద్‌ నుంచి చార్మినార్‌ వరకు ర్యాలీ తీశాయి. 
 
ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చార్మినార్‌ వద్ద పోలీసు బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. ఇదిలా ఉంటే.. తనను హత్య చేస్తామంటూ బెదిరింపు కాల్స్, లేఖలు వస్తున్నాయంటూ నుపుర్ శర్మ.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
సదరు వ్యాఖ్యలకు గాను కొందరు తనను వేధిస్తున్నారని, అసభ్యకరంగా దూషిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నుపుర్‌, ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments