తెలంగాణ రాష్ట్రంలో పడిపోతున్న రాత్రి - పగటి ఉష్ణోగ్రతలు

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (10:09 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా, రాత్రిపూట పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో చలి ఒక్కసారిగా పెరిగిపోయింది. వచ్చే రెండు రోజుల్లో చలి మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
అలాగే, పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయని వెల్లడించింది. ఫలితంగా చలి పెరుగుతోందని పేర్కొంది. ఈశాన్య, వాయువ్య భారత్ నుంచి తక్కువ ఎత్తులో చలిగాలులు తెలంగాణా వైపు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో పగటి వేళ పొడి వాతావరణం ఉంటుంది, రాత్రివేళ భూవాతావరణం త్వరగా చల్లబబడుతుందని ఈ కారణంగా చలి తీవ్ర పెరుగుతుందని తెలిపింది. 
 
అదేసమయంలో ఉదయం పూట పొగ మంచు కురుస్తుందని, గాలిలో తేమ సాధారణం కంటే 25 శాతం అధనంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న వివరించారు. సోమవారం కుమరం భీమ్ జిల్లాలోని సిర్పూర్‌లో అత్యల్పంగా 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, వచ్చే పది రోజుల్లో ఇది 10 కంటే తక్కువ డిగ్రీల్లో నమోదు కావొచ్చని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purushah Review: భార్యాభర్తల కష్టాలను వినోదాత్మకంగా చెప్పిన పురుషః చిత్రం రివ్యూ-

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

తర్వాతి కథనం
Show comments