Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్కొండ మెట్లబావి - దోమకొండకు యునెస్కో గుర్తింపు

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (08:57 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో రెండు కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించింది. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలోని గోల్కొండ కోటలో ఉన్న మెట్లబావి, దోమకొండకు ఈ అవార్డులు వరించాయి. అలాగే, ముంబైలోని ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం, బైకుల్లా రైల్వే స్టేషన్‌కు ఈ ఆవార్డులు వచ్చాయి. 
 
యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలకు ఆసియా - పసిఫిక్ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కోవలోనే తాజాగా దేశంలోని పలు భవనాలకు ఈ అవార్డులు వరించాయి. 
 
ముఖ్యంగా తెలంగాణాలో గోల్కొండ కోటలో ఉన్న మెట్లబావి, దోమకొండకు ఈ అవార్డులు వరించాయి. గోల్కొండ మెట్లబావి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ విభాగంలోనూ, దోమకొండ కోటకు అవార్డ్ ఆఫ్ మెరిట్ విభాగంలో చోటు సంపాదించుకున్నాయి. 
 
ఈ అవార్డుల కోసం మొత్తం 11 దేశాల్లో 50 చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించిన దరఖాస్తులు రాగా, వీటి వడపోత తర్వాత ఆరు దేశాల్లో 13 కట్టడాలను ఐదు కేటిగిరీల్లో అవార్డుల్లో ఎంపిక  చేశారు. వీటిలో నాలుగు భారత్‌కు, మరో నాలుగు చైనాకు దక్కగా, ఇరాన్‌కు రెండు, థాయ్‌లాండ్‌, ఆప్ఘనిస్థాన్‌, నేపాల్ దేశాలకు ఒక్కొక్కటి చొప్పున దక్కాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments