Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైన్ చెల్లించమని కోరిందనీ... టీటీఐని రైల్లోనుంచి తోసేశారు...

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (11:00 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట జంక్షన్‌లో ఓ దారుణం జరిగింది. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని అపరాధం చెల్లించమని అడిగినందుకు ఆ మహిళా టీటీఐని రైల్లో నుంచి కిందికి దించేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాజీపేట జంక్షన్‌ రైల్వే కమర్షియల్‌ విభాగంలో టీటీఐగా నీలిమ అనే మహిళ పని చేస్తోంది. ఈమె సికింద్రాబాద్‌ నుంచి ధానాపూర్‌ వెళ్లే పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేటకు చేరుకుంది. స్లీపర్‌ క్లాస్ ఒకటో నంబరు బోగీలో వెళ్లి ప్రయాణికుల వద్ద టిక్కెట్లను తనిఖీ చేపట్టారు. అపుడు కొందరు ప్రయాణికులు జనరల్‌ టికెట్‌ తీసుకుని స్లీపర్‌క్లాస్‌ కోచ్‌లోకి రావడంతో గుర్తించి, వారందరినీ అపరాధం చెల్లించాలని కోరింది. 
 
అయితే, బోగీ ప్రయాణికులతో రద్దీగా ఉండటంతో ఏ ఒక్క ప్రయాణికుడు ఆమె మాటను పట్టించుకోలేదు. పైగా, ఆమెను కిందికి తోసేశారు. దీంతో ఆమె ప్లాట్‌ఫాంపై పడింది. ఆమె కాలు ప్లాట్‌ఫాం సందులోకి వెళ్లడంతో జనరల్‌ బోగీ ప్రయాణికులు గమనించి బయటికిలాగేశారు. 
 
సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని నీలిమను రైల్వే ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో పాట్నా ఎక్స్‌ప్రెస్‌ కొన్ని నిమిషాల పాటు కాజీపేటలో నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments