Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం కేసులో మహిళా కార్పొరేటర్ భర్త అరెస్టు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (14:10 IST)
తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కేంద్రంలో ఓ అత్యాచార కేసులో మహిళా కార్పొరేటర్ భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఇది స్థానికంకా సంచలనమైంది. ఈ విషయాన్ని వరంగల్‌ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేటర్‌ భర్త శిరీష్‌ తనను పెళ్లి పేరిట నమ్మించి ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
దీంతో సెప్టెంబర్‌ 23వ తేదీన కార్పొరేటర్‌ భర్తపై అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల కింద కేసులు నమోదు చేసినట్లు మీల్స్‌ కాలనీ పోలీసులు తెలిపారు.
 
అప్పటి నుంచి శిరీష్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న శిరీష్‌ను గురువారం అర్థరాత్రి అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితుడిని పరకాల జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments