Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లేడుతో గొంతు కోసుకున్న వీఆర్‌ఏ.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (08:29 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వీఆర్ఏ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఆయన ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గుండ్రపల్లిలో జరిగింది.
 
వేతన సవరణ, పదోన్నతలు సహా పలు డిమాండ్ల సాధనం కోసం ఆ రాష్ట్రానికి చెందిన వీఆర్ఏలు గత 69 రోజులుగా దీక్ష చేస్తున్నారు. అయితే, మంత్రు గానీ, అధికారులు గానీ వారి ఆందోళనపై కించిత్ కూడా లెక్కచేయలేదు. దీక్ష చేపట్టి రోజులు గడిచిపోతున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వీఆర్ఏలు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. 
 
వీరిలో ఖాసిం అనే వీఆర్ఏ నెక్కొండ తాహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షా శిబిరం వద్ద బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని గమనించిన సహచరులు ఖాసింను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు స్పందిస్తూ, సమస్యల పరిష్కారం కోస నెలల తరబడిన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments