Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లేడుతో గొంతు కోసుకున్న వీఆర్‌ఏ.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (08:29 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వీఆర్ఏ బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఆయన ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గుండ్రపల్లిలో జరిగింది.
 
వేతన సవరణ, పదోన్నతలు సహా పలు డిమాండ్ల సాధనం కోసం ఆ రాష్ట్రానికి చెందిన వీఆర్ఏలు గత 69 రోజులుగా దీక్ష చేస్తున్నారు. అయితే, మంత్రు గానీ, అధికారులు గానీ వారి ఆందోళనపై కించిత్ కూడా లెక్కచేయలేదు. దీక్ష చేపట్టి రోజులు గడిచిపోతున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వీఆర్ఏలు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. 
 
వీరిలో ఖాసిం అనే వీఆర్ఏ నెక్కొండ తాహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షా శిబిరం వద్ద బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని గమనించిన సహచరులు ఖాసింను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు స్పందిస్తూ, సమస్యల పరిష్కారం కోస నెలల తరబడిన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments