Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం కేసులో తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అరెస్టు

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (10:51 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏలుబడిలో ఓ యూనివర్శిటీ ఉపకులపతి లంచం కేసులో అరెస్టు అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో తెలంగాణ యూనివర్శిటీ ఒకటి. వైస్ ఛాన్సలర్‌గా దాచేపల్లి రవీంద్ర గుప్తా కొనసాగుతున్నారు. ఈయన్ను ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. 
 
ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధి నుండి రూ.50,000 లంచం తీసుకుంటుంటగా రవీందర్ గుప్తాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తమ కాలేజీకి పరీక్షా కేంద్రం కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. శ్రీ షిర్డీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు డి.శంకర్ నుంచి లంచం తీసుకుంటుండగా గుప్తా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ సీనియర్ అధికారులు తెలిపారు.
 
ఏసీబీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గుప్తాకు డబ్బు అందజేశారని, ఆ తర్వాత ఆయన సమక్షంలోనే అల్మారా నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రూ.10 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగంలో గుప్తా ప్రమేయంపై వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని అధిక ధరలకు కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments