Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో తెరుచుకోనున్న పాఠశాలలు... సీఎం కేసీఆర్ ఆదేశాలు

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (15:25 IST)
కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతపడివున్నాయి. అయితే అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా అన్ని రంగాలు కూడా ఒక్కొక్కటిగా తెరుచుకుంటుండగా, తెలంగాణలో విద్యా సంస్థలు కూడా పై తరగతి విద్యార్థులకు మాత్రమే అనుమతిస్తూ తరగతులను ప్రారంభించారు. 
 
తాజాగా కేసీఆర్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి 6,7, 8 తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ తరగతులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి మార్చి ఒకటో తేదీలోపు తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. 
 
అలాగే పాఠశాలల్లో కోవిడ్‌ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు. అయితే పాఠశాలలు తెరుచుకుంటుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
 
అలాగే పాఠశాల తరగతి గదుల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తుండాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అధ్యాపకులు, విద్యార్థులు తప్పకుండా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
 
ఈ మధ్యనే 9,10, ఆపై తరగతుల వారికి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, వారికి మాత్రమే తరగతులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు 6,7,8 తరగతులను ప్రారంభించాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. మరీ మిగత కింది తరగతులను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments