Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు మూడు రోజుల్లోనే టెన్త్ పరీక్షలు.. గ్రేడ్లను అలా..?

Webdunia
మంగళవారం, 18 మే 2021 (20:52 IST)
తెలంగాణలో టెన్త్ రిజల్ట్ మరో రెండు మూడు రోజుల్లోనే వెలువడే అవకాశాలున్నాయి. కరోనా వ్యాప్తితో వరుసగా రెండోవ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు రద్దు చేయడంతో.. ఫార్మేటివ్ అసెస్ మెంట్ (FA-1) ఆధారంగా గ్రేడ్లను కేటాయిస్తున్నారు. 
 
పరీక్ష ఫీజు చెల్లించిన 5లక్షల 21వేల 398 మంది ఫలితాలు రెండు మూడు రోజుల్లో రానున్నాయి. వీరిలో సుమారు 2లక్షల మంది 10/10 జీపీఏతో ఉత్తీర్ణుడు కానున్నారని సమాచారం. అంటే గతేడాది కంటే దాదాపు 60వేలు ఎక్కువ
మంది ఉన్నారు. కరోనా కారణంగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. 
 
అయితే ఈసారి పదో తరగతి పరీక్షలు లేకున్నా విద్యార్థులకు హాల్‌ టికెట్‌ నంబర్లను కేటాయించారు. ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌(ఎఫ్ఏ-1) మార్కుల ఆధారంగా వార్షిక పరీక్షల మార్కులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కుల మెమోలో హాల్‌టికెట్‌ నంబర్‌ను కూడా నమోదు చేస్తారు. 
 
కాగా.. గతేడాది నాలుగు ఎఫ్‌ఏ పరీక్షల సగటు ఆధారంగా టెన్త్‌ ఫలితాలు ప్రకటించారు. ఈసారి మాత్రం ఒక్క ఎఫ్‌ఏ ఆధారంగానే వార్షిక పరీక్ష మార్కులు కేటాయించనున్నారు. ఫలితాలు ప్రకటించాక.. నెలాఖరులోగా మెమోలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments