Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్: 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలిస్తే చాలు

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (10:56 IST)
తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా సిలబస్ ఇంకా పూర్తి కాకపోవడంతో 50 శాతం ఛాయిస్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాబోయే ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022లో విద్యార్థులకు పెద్ద ఉపశమనంగా, వివిధ విభాగాలలో 50 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చే అవకాశం ఉంటుంది. 
 
ఆబ్జెక్టివ్ పార్ట్‌లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా ఛాయిస్‌ ప్రశ్న పత్రాల థియరీ విభాగాలలో మార్పులు చేశారు. మొత్తంమీద, ఈ సంవత్సరం ఎస్‌ఎస్‌సీ పరీక్షలలో ప్రశ్నలలో 50 శాతం ఛాయిస్ ఉంటుంది. మోడల్ ప్రశ్న పత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ఒక అధికారి తెలిపారు. 
 
ముందుగా ప్రకటించినట్లుగా ఎస్‌ఎస్‌సీ పరీక్షలు 2022 అన్ని సబ్జెక్టులలో మొత్తం సిలబస్‌లో 70 శాతం మాత్రమే నిర్వహించబడతాయి. సాధారణ 11 పేపర్‌లకు బదులుగా ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి.
 
ఇప్పటి వరకు 4.81 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14తో ముగియగా, విద్యార్థులు పరీక్ష రుసుమును రూ. 50 మరియు రూ. 200 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 24 వరకు మరియు మార్చి 4 వరకు చెల్లించవచ్చు. 
 
రుసుము కూడా రూ. 500 ఆలస్య రుసుముతో మార్చి 14 వరకు ఆమోదించబడుతుంది. గత సంవత్సరం దాదాపు 5.16 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. 
 
అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా పరీక్షలు నిర్వహించబడలేదు. విద్యార్థులు వారి ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు

ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్

మలయాళ విలన్ నటుడు మోహన్ రాజ్ ఇకలేరు...

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments