Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికృష్ణ తనయ కాదు నా కుమార్తె : టీడీపీ నేత పెద్దిరెడ్డి

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (09:54 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేస్తోంది. ఈమె శనివారం నామినేషన్ దాఖలు చేసింది. వాస్తవానికి ఈ స్థానంపై టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి బోలెడు ఆశలుపెట్టుకున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన బలంగా పట్టుబట్టారు. 
 
కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ స్థానాన్ని నందమూరి సుహాసినికి కేటాయించారు. దీనిపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ, నందమూరి సుహాసిని తనకు కూతురుతో సమానమని, ఆమెను గెలిపించడం తన బాధ్యత అని చెప్పారు. ఎన్నికల బరిలో ఎవరున్నా గెలిపించడం తమ బాధ్యత అని చెప్పారు. 
 
పైగా, తాను కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తానని ఎన్నడూ చెప్పలేదని, అందువల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అభ్యర్థి విషయంలో పార్టీ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడివుంటానని తెలిపారు. 
 
అంతేకాకుండా, తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతోనే సుహాసిని రాజకీయాల్లోకి వచ్చారని, ఆమెకు ఎలాంటి స్వార్థం లేదని, కేవలం ప్రజాసేవ చేయాలన్న బలమైన ఆకాంక్ష మాత్రమే ఉందన్నారు. కొత్తవాళ్ళకు కూడా అవకాశం కల్పించే చర్యలో భాగంగా సుహాసినికి టిక్కెట్ ఇచ్చినట్టు పెద్దరెడ్డి వివరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments