హరికృష్ణ తనయ కాదు నా కుమార్తె : టీడీపీ నేత పెద్దిరెడ్డి

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (09:54 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేస్తోంది. ఈమె శనివారం నామినేషన్ దాఖలు చేసింది. వాస్తవానికి ఈ స్థానంపై టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి బోలెడు ఆశలుపెట్టుకున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన బలంగా పట్టుబట్టారు. 
 
కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ స్థానాన్ని నందమూరి సుహాసినికి కేటాయించారు. దీనిపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ, నందమూరి సుహాసిని తనకు కూతురుతో సమానమని, ఆమెను గెలిపించడం తన బాధ్యత అని చెప్పారు. ఎన్నికల బరిలో ఎవరున్నా గెలిపించడం తమ బాధ్యత అని చెప్పారు. 
 
పైగా, తాను కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తానని ఎన్నడూ చెప్పలేదని, అందువల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అభ్యర్థి విషయంలో పార్టీ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడివుంటానని తెలిపారు. 
 
అంతేకాకుండా, తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతోనే సుహాసిని రాజకీయాల్లోకి వచ్చారని, ఆమెకు ఎలాంటి స్వార్థం లేదని, కేవలం ప్రజాసేవ చేయాలన్న బలమైన ఆకాంక్ష మాత్రమే ఉందన్నారు. కొత్తవాళ్ళకు కూడా అవకాశం కల్పించే చర్యలో భాగంగా సుహాసినికి టిక్కెట్ ఇచ్చినట్టు పెద్దరెడ్డి వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

రోషన్, అనస్వర రాజన్.. ఛాంపియన్ నుంచి గిర గిర గింగిరాగిరే సాంగ్

Vanara: సోషియో ఫాంటసీ కథతో అవినాశ్ తిరువీధుల మూవీ వానర

Akhanda 2: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments