Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోపై పడిన లారీలు

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (07:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంగానగర్ గోదావరి దాబా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొట్టి పక్కనే వెళుతున్న ఆటోపై పడ్డాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వీరిలో దంపతులు, చిన్నారి వుంది. మరో చిన్నారి మాత్రం మృత్యువు నుంచి బయటపడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రామగుండానికి చెందిన షేక్ షకిల్, అతని భార్య రేష్మ, తన ఇద్దరు పిల్లలు కలిసి మంచిర్యాల జిల్లా ఇందారంలో తమ బంధువుల ఇంట జరిగే శుభకార్యానికి ఒక ఆటోలో బయలుదేరారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత ఆటోలో మరో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. 
 
ఈ ఆటో గంగానగర్ వద్ద ఫ్లైఓవర్ యూటర్న్ చేస్తున్న సమయంలో బోగ్గులారీని ఫ్లైఓవర్ నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఆ సమయంలో లారీ పక్క నుంచి ఆటో వెళుతున్నది. రెండు లారీలు బలంగా ఢీకొనడంతో పక్కనే ఉన్న లారీపై పడింది. ఈ ఘటనలో దంపతులతో పాటు ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments