Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోపై పడిన లారీలు

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (07:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంగానగర్ గోదావరి దాబా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొట్టి పక్కనే వెళుతున్న ఆటోపై పడ్డాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వీరిలో దంపతులు, చిన్నారి వుంది. మరో చిన్నారి మాత్రం మృత్యువు నుంచి బయటపడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రామగుండానికి చెందిన షేక్ షకిల్, అతని భార్య రేష్మ, తన ఇద్దరు పిల్లలు కలిసి మంచిర్యాల జిల్లా ఇందారంలో తమ బంధువుల ఇంట జరిగే శుభకార్యానికి ఒక ఆటోలో బయలుదేరారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత ఆటోలో మరో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. 
 
ఈ ఆటో గంగానగర్ వద్ద ఫ్లైఓవర్ యూటర్న్ చేస్తున్న సమయంలో బోగ్గులారీని ఫ్లైఓవర్ నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఆ సమయంలో లారీ పక్క నుంచి ఆటో వెళుతున్నది. రెండు లారీలు బలంగా ఢీకొనడంతో పక్కనే ఉన్న లారీపై పడింది. ఈ ఘటనలో దంపతులతో పాటు ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments