ఇ-పాస్ లేకుండా వచ్చారా? తిన్నగా వచ్చిన దారినే వెనక్కెళ్లండి: ఏపీ వాహనాలను తెలంగాణ పోలీసులు వెనక్కి

Webdunia
సోమవారం, 24 మే 2021 (10:43 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ -19 లాక్‌డౌన్ అమలు కావడంతో, తెలంగాణ పోలీసులు హైవేల వద్ద ఇ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతించి, ఇ-పాస్‌లు లేని వాహనాలను అడ్డుకుంటున్నారు. ఆదివారం గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల నుంచి తెలంగాణ వైపు వస్తున్న పలు వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుని ఇ-పాస్ లేనందువల్ల వచ్చిన దారినే తిరిగి వెనక్కి వెళ్లాలని పంపిచేశారు.
 
ఆంక్షల గురించి తెలియక, కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటను దాటి విజయవాడ-హైదరాబాద్ రహదారిపై పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణించారు. కానీ, తెలంగాణ పోలీసులు వాహనాలను తనిఖీ చేసి ఇ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించారు. అంతర్రాష్ట్ర ప్రయాణానికి ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ఇ-పాస్ పొందాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇటీవల ప్రకటించారు. కానీ, అది తెలియక చాలామంది సూర్యపేట ద్వారా తెలంగాణలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.
 
గుంటూరు జిల్లా ప్రయాణికుల విషయంలో కూడా ఇదే. తెలంగాణ పోలీసులు ఎపి వాహనాలను అంతరాష్ట్ర సరిహద్దు నుంచి గుంటూరు జిల్లాకు పంపించారు. తెలంగాణ పోలీసుల ఆంక్షలతో అనేక వందల మంది నిరాశ చెందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇ-పాస్ పొందడానికి ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో అత్యవసర పనులకు హాజరు కావాలనుకున్న చాలా మంది ప్రజలు టిఎస్ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో నిరాశ చెందారు.
 
గుంటూరు జిల్లా నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు నల్గొండ జిల్లాలోని వడపల్లి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ సమీపంలో అడ్డుకున్నారు. ఇ-పాస్ లేనందున తెలంగాణ పోలీసులు గుంటూరు జిల్లాకు చాలా వాహనాలను తిరిగి పంపారు. మరోవైపు, కొంతమంది పోలీసు అధికారులు ప్రయాణికులతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని, వారు తిరిగి ఎపికి వెళ్లకపోతే లాఠీచార్జ్ చేస్తామని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ప్రయాణీకులు వడపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసుల ప్రవర్తనపై నిరసన తెలిపారు. ఈ-పాస్ విధానాన్ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారని గురజాల డిఎస్పీ బి మెహర్ జయరామ్ ప్రసాద్ తెలిపారు.
 
ఆదివారం కర్నూలు-తెలంగాణ రహదారిపై కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఇ-పాస్ లేనందున కర్నూలు జిల్లా నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు, అంబులెన్స్‌లను హైదరాబాద్ వైపు తరలించడానికి అనుమతించారు. హైదరాబాద్ ఆసుపత్రులలో చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రంలోకి వచ్చే అంబులెన్స్‌లను నిరోధించడాన్ని తెలంగాణ హైకోర్టు ఇటీవల తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి విశ్వనాథ్- సన్స్ టైటిల్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

Ram Charan: పెద్ది డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments