సీబీఎస్ఈ పరీక్షలు రద్దు.. తెలంగాణ టెన్త్ బోర్డ్ నిర్ణయం ఏమిటి..?

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (09:53 IST)
సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. టెన్త్ బోర్డ్ పరీక్షలతో పాటు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని యోచిస్తోంది. సెకండియర్ ఎగ్జామ్స్ మాత్రం మరి కొద్దిరోజులు వాయిదా వేయాలని భావిస్తోంది. గురువారం విద్యా శాఖ అధికారులు పరీక్షలపై నిర్వహించే సమీక్ష కీలకంగా మారింది.
 
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 3,307 మందికి కరోనా సోకింది. ఈ మహమ్మారి బారిన పడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కరోనా నుంచి మరో 897 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.38లక్షలకు చేరింది. ఇప్పటివరకు 1,788 మంది కోవిడ్ తో మృత్యువాత పడ్డారు. 
 
రాష్ట్రంలో 27,861 కరోనా యాక్టివ్ కేసులుండగా, 3.08లక్షల మంది కరోనా భూతం నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హోంఐసోలేషన్ లో 18,685 మంది చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 446 మంది కోవిడ్-19 బారినపడినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments