Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నింటా తెలంగాణ నంబర్ వన్: గవర్నర్ సౌందరరాజన్

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (08:22 IST)
తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు నూతన గవర్నర్ తమిళ ఇసై సౌందరరాజన్. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ అంటూ కితాబిచ్చారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ ప్రజలను ఉద్దేశించి సౌందరరాజన్ ప్రసంగించారు. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోబోతుందంటూ స్పష్టం చేశారు. 
 
బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుని దేశంలోనే గొప్ప రాష్ట్రంగా నిలిచిపోతుందని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తమిళ ఇసై అన్నారు. 
 
తెలంగాణ 14.43 శాతం అభివృద్ధి రేటు సాధించిందని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రపంచ దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని ప్రశంసించారు. ఐటీ ఉత్పత్తులు, ఎగుమతుల్లో హైదరాబాద్ రికార్డు నెలకొల్పిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments