తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 29, 30న జరగాల్సిన పరీక్షలను ఈ నెల 31, నవంబర్ 1వ తేదీకి మార్చారు.
తెలంగాణలో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్(ప్రమోటై ప్రస్తుతం సెకండియర్లో ఉన్న విద్యార్థులు) నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 70 శాతం సిలబస్ నుంచే ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.