Webdunia - Bharat's app for daily news and videos

Install App

పావు గంట ఆలస్యమైనా ప్రాక్టికల్స్‌కు అనుమతి

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (11:10 IST)
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి పావు గంట ఆలస్యమైన ప్రాక్టికల్స్ పరీక్షా హాలుకు అనుమతిస్తామని తెలిపింది. 
 
ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ల్యాబ్‌కు 15 నిమిషాలు ఆలస్యమైన అనుమతిస్తామని తెలిపింది. ఆ తర్వాత మాత్రం అనుమతించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, విద్యార్థులు వారు చదువుకుంటున్న కాలేజీల్లోనే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. జాగ్రఫీ విద్యార్థులకు మాత్రం ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రాక్టిల్స్ నిర్వహించేలా ఏర్పాట్టు చేశారు. 
 
అలాగే, ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపక సిబ్బందిని కూడా విధుల నుంచి రిలీవ్ చేయాలని, లేదంటే రూ.5 వేల అపరాధం విధిస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అలాగే, విద్యార్థులకు ఎగ్జామినర్లు వేసిన మార్కులను అదే రోజు రాత్రి 8 గంటల లోపు ఆన్‌లైన్‌లో బోర్డుకు పంపించాన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments