Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఇంటర్మీడియట్ రుసుంలపై హైకోర్టులో విచారణ

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:41 IST)
ఇంటర్మీడియట్ బోర్డు ఖరారు చేసిన రుసుములు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమమవుతోందంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. ఫోరం అగేనెస్ట్ కరప్షన్ అనే సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

ఇంటర్మీడియట్ రుసుములుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు ఖరారు చేసిన రుసుములు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమమవుతోందంటూ హైకోర్టులో ఫోరం అగేనెస్ట్ కరప్షన్ అనే సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. పిటిషన్​పై జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

జూనియర్ కాలేజీలు బోర్డు ఉత్తర్వులు అమలు చేయకుండా.. భారీ రుసుములతో విద్యార్థులు, తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని పిటిషనర్ ఆరోపించారు. కాలేజీల్లో తీసుకోవాల్సిన ఫీజులను 2013 మే 24న ఇంటర్ బోర్డు ఖరారు చేసిందని వివరించారు.

ఇంటర్ బోర్డు ఉత్తర్వులను అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం... రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా మండలి, ఇంటర్ బోర్డు కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments