Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఇంటర్మీడియట్ రుసుంలపై హైకోర్టులో విచారణ

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:41 IST)
ఇంటర్మీడియట్ బోర్డు ఖరారు చేసిన రుసుములు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమమవుతోందంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. ఫోరం అగేనెస్ట్ కరప్షన్ అనే సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

ఇంటర్మీడియట్ రుసుములుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు ఖరారు చేసిన రుసుములు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమమవుతోందంటూ హైకోర్టులో ఫోరం అగేనెస్ట్ కరప్షన్ అనే సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. పిటిషన్​పై జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

జూనియర్ కాలేజీలు బోర్డు ఉత్తర్వులు అమలు చేయకుండా.. భారీ రుసుములతో విద్యార్థులు, తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని పిటిషనర్ ఆరోపించారు. కాలేజీల్లో తీసుకోవాల్సిన ఫీజులను 2013 మే 24న ఇంటర్ బోర్డు ఖరారు చేసిందని వివరించారు.

ఇంటర్ బోర్డు ఉత్తర్వులను అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం... రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా మండలి, ఇంటర్ బోర్డు కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments