Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ప్రమాదకరమైన వాతావరణం: దట్టంగా కమ్మిన మబ్బులు

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (17:39 IST)
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. తెలంగాణలో వర్షాలు, పిడుగులు హడలెత్తిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. గంట వ్యవధిలో నాలుగు చోట్ల పిడుగులు పడ్డాయి. నలుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ మెరుపులు, ఉరుములతో జనాలు భయాందోళనల్లో ఉన్నారు. 
 
వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడుతోంది. ఈ క్రమంలో నగరంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడ చూసినా ఇంకా వరదనీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి.
 
శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన భారీ, అతి భారీ వర్షాలకు హయత్ నగర్ డివిజన్‌లోని లంబాడీ తండ కాలనికి వరద నీరు చేరడంతో మొత్తం150 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సమాచారం మేయర్ గద్వాల విజయ లక్ష్మికి వచ్చిన వెంటనే హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్‌కు ఫోన్ చేసి లంబాడీ తండ వాసులను తరలించాలని ఆదేశించారు. 
 
మేయర్ వెంటనే వారిని తరలించేందుకు అక్కడికి వాహనం కూడా పంపించారు. డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ ఆధ్వర్యంలో బాధిత 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారికి త్రాగు నీరు భోజన వసతి కల్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు : శ్రీకాంత్

Malavika Mohanan మాళవిక మోహనన్ ట్రెండ్ ఎందుకవుతోంది?

పవన్ కళ్యాణ్ నా దేవుడు.. నా రక్తం కాంగ్రెస్ : బండ్ల గణేష్

ఇతర గుర్తింపు కంటే ఒక కుమార్తెగా మీ అందరికీ ఇది రాస్తున్నాను : పూనమ్ కౌర్

గబ్బర్‌ సింగ్‌ రీరిలీజ్ లో కూడా టికెట్లు దొరకడం లేదు. అంత క్రేజ్ వుంది : నిర్మాత బండ్ల గణేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోంగూర తింటే కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గాలా? ఐతే ఈ డ్రింక్స్ తాగి చూడండి

స్టేజ్ III నాలుక క్యాన్సర్‌తో బాధపడుతున్న 91 ఏళ్ల వృద్ధుడిని కాపాడిన విజయవాడ ఏఓఐ

నేతితో వంకాయ వేపుడు ఎలా?

టీలో కల్తీని గుర్తించటం ఎలా?: ప్రతి వినియోగదారుడు తెలుసుకోవలసిన అంశాలు

తర్వాతి కథనం
Show comments