Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ప్రమాదకరమైన వాతావరణం: దట్టంగా కమ్మిన మబ్బులు

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (17:39 IST)
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. తెలంగాణలో వర్షాలు, పిడుగులు హడలెత్తిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. గంట వ్యవధిలో నాలుగు చోట్ల పిడుగులు పడ్డాయి. నలుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ మెరుపులు, ఉరుములతో జనాలు భయాందోళనల్లో ఉన్నారు. 
 
వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడుతోంది. ఈ క్రమంలో నగరంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడ చూసినా ఇంకా వరదనీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి.
 
శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన భారీ, అతి భారీ వర్షాలకు హయత్ నగర్ డివిజన్‌లోని లంబాడీ తండ కాలనికి వరద నీరు చేరడంతో మొత్తం150 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సమాచారం మేయర్ గద్వాల విజయ లక్ష్మికి వచ్చిన వెంటనే హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్‌కు ఫోన్ చేసి లంబాడీ తండ వాసులను తరలించాలని ఆదేశించారు. 
 
మేయర్ వెంటనే వారిని తరలించేందుకు అక్కడికి వాహనం కూడా పంపించారు. డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ ఆధ్వర్యంలో బాధిత 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారికి త్రాగు నీరు భోజన వసతి కల్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments