సంగారెడ్డిలో 420 కేజీల గంజాయి పట్టివేత

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (10:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో ఆ రాష్ట్ర పోలీసులు 420 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 25 లక్షల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు నుంచి అక్రమంగా తరలిస్తుండగా ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇదే అంశంపై జిల్లా ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ, ఏపీలోని ఏలూరు నుంచి భారీ మొత్తంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. దీంతో జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా, ఆ దారిలో వచ్చిన ఒక లారీని ఆపి తనిఖీ చేస్తే ఈ గంజాయి చిక్కినట్టు వెల్లడించారు.
 
మొత్తం 420 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని, దీని విలువ రూ.25 లక్షలకు పైగా ఉంటుందని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ప్రాంతానికి చెందిన అశోక్ కేసరి అనే వ్యక్తి డ్రైవరుగా పని చేస్తూ అక్రమంగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments