Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ ఫస్టియర్ మార్కులే ఇంటర్ సెకండ్‌ ఇయర్‌కూ...

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (16:41 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా విద్యార్థులకు వార్షిక పరీక్షలను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థలందరిన పాస్ చేసినట్టు ప్రకటించింది. కానీ, మార్కుల కేటాయింపులో ఓ మెలిక పెట్టింది. ఇంటర్ మొదటి సంవత్సవరంలో వచ్చిన మార్కులనే సెకండ్ ఇయర్‌లోనూ కేటాయిస్తామని తెలిపింది. 
 
ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శికి విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. ఫస్టియర్‌లో ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులనే సెకండియర్‌కూ కేటాయిస్తున్నట్టు ప్రభుత్వ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.
 
ఫస్టియర్‌లో ఫెయిలైన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు సెకండియర్‌లో 35 శాతం మార్కులను కేటాయించనున్నట్టు పేర్కొంది. అలాగే, సెకండియర్ ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపింది. 
 
ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్టు పేర్కొంది. అయితే, తాజా మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగైన తర్వాత కావాలనుకుంటే ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments