Webdunia - Bharat's app for daily news and videos

Install App

మట్టి పొలాలపై పడిన తెలంగాణ ప్రభుత్వం: చుక్కలు చూస్తున్న భూముల ధరలు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:05 IST)
ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే మద్యం ఏరులై పారుతుందని అంటుంటారు. ఆ సంగతి ప్రక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వాలు మద్యం కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పిండుకునే పని ప్రారంభిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భూముల ధరలను భారీగా పెంచేసింది.

 
రాష్ట్రంలోని అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు కేవలం ఆరు నెలల్లోనే ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ వ్యవసాయం, వ్యవసాయేతర, వాణిజ్యం వంటి అన్ని రకాల ఆస్తులపై మార్కెట్ విలువలను 15 శాతం నుంచి 60 శాతం వరకూ పెంచింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
 
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021-2022లో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ రూ.12,000 కోట్ల ఆదాయాన్ని పొందుతుందని, మార్కెట్ విలువల పెంపుదల తర్వాత మరో రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

 
రిజిస్ట్రేషన్ కోసం భూమి విలువలను వ్యవసాయ ఆస్తులకు 50%, కొన్ని గ్రామాల్లో ప్రస్తుత ధరలపై 60%కి పెంచనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ప్రభుత్వం నిర్ణయించిన కనీస భూమి ధరల ఆధారంగా 7.5% స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రెండింటినీ సేకరిస్తుంది. గతేడాది ఆగస్టులో ప్రభుత్వం ఆస్తుల విలువను పెంచింది.

 
పెంచిన భూముల ధరల ప్రకారం వ్యవసాయ ఆస్తులకు ఎకరానికి రూ. 75,000 రిజిస్ట్రేషన్ల కోసం ప్రస్తుతం ఉన్న కనీస రేటు ఎకరాకు రూ. 1.50 లక్షలకు పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న విలువలపై 35%, ఫ్లాట్లపై 15% నుండి 25% వరకు రేట్లు పెంచే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments