Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (13:35 IST)
బతుకమ్మ సంబురాలను రాజభవన్ ప్రాంగణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నరు తమిళసై సౌందరరాజన్ తెలుగులో తెలంగాణాలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
మహిళలు బంగారం, దుస్తులతోపాటు పూలను బాగా ఇష్టపడతారని, శరత్ రుతువు ఆగమనాన్ని తెలియజేసే చక్కని పూల పండుగ బతుకమ్మ పండుగ అని ఆమె అభివర్ణించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో- బంగారు బతుకమ్మ ఉయ్యాలో -  కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో- అని రాగతాళ యుక్తంగా తెలుగులో చక్కగా ఆమె ఆలపించారు.
 
ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ అభిమానులు, రచయిత్రులు శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, శ్రీమతి ఆవుల మంజులత, శ్రీమతి దీపికారెడ్డి, ఆమె శిష్య బృందం, తదితర మహిళలు 200 మందికి పైగా పాల్గొన్నారు. 

ఎంతో సంతోషంగా వేడుకగా జరుపుకునే బతుకమ్మ పండుగను రాజభవన్ ప్రాంగణంలో అక్టోబరు 5 వరకూ ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి ఓ గంటపాటు బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు గవర్నరు గారి కార్యదర్శి శ్రీ సురేంద్ర మోహన్ తెలిపారు.
 
ముఖ్యంగా, అక్టోబరు 1న మహిళా జర్నలిస్టులు, న్యాయవాదులు, అక్టోబరు 4న విద్యార్థులు పాల్గొంటున్నారని ఆయన అన్నారు. అక్టోబరు 5న రాజభవన్ మహిళా ఉద్యోగినులు, రాజభవన్ పరివారం పాల్గొంటారని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments