Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడితో రంకుబాగోతానికి అడ్డొస్తున్నాడనీ...

Advertiesment
Telangana
, శనివారం, 28 సెప్టెంబరు 2019 (10:25 IST)
ప్రియుడితో రంకుబాగోతానికి అడ్డొస్తున్నాడనీ భర్తకు కట్టుకున్న భార్య అన్నంలో విషం కలిపిపెట్టి హత్య చేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా గూడూరు మండలంలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మండలంలోని మూడు గుడిసెల తండాకు చెందిన మాలోత్ మోహన్ (30), పావని అనే దంపతులు ఉండగా, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, అదే గ్రామానికి చెందిన అజ్మీర శ్రీను అనే యువకుడుతో పావని అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త దీనిని పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లాడు. పంచాయితీ పెట్టిన పెద్దలు పావనిని మందలించారు.
 
దీంతో భర్తపై కక్ష పెంచుకున్న పావని.. ప్రియుడు శ్రీనుతో కలిసి భర్తను అడ్డుతొలగించుకునేందుకు ప్లాన్ వేసింది. అందులోభాగంగా బుధవారం మధ్యాహ్నం విషం కలిపిన ఆహారాన్ని అతడికి అందించింది. అది తిన్న మోహన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 
 
గమనించిన మోహన్ తల్లి హేమ్లీ, గ్రామస్థుల సాయంతో కుమారుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మోహన్ తల్లి ఫిర్యాదుపై గురువారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో ముస్లింలకు చిత్రహింసలు... పాక్‌ను నిలదీసిన అమెరికా