Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధులు మూడు టైపులు... తెలంగాణాలో అంతే!

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:12 IST)
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మూడు రకాల వృద్దులను గుర్తించింది. 
 
తెలంగాణాలో సామాన్య ప్రజలు వృద్ధాప్య పెన్షన్ పొందాలి అంటే 57 ఏళ్ళు ఉండాలి. అంటే 57 ఏళ్ల తరువాత సామాన్యులు వృద్ధులు అవుతారు అన్న‌మాట‌. పింఛ‌ను ఇవ్వ‌డానికి తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన వృద్ధుల వ‌య‌సు ఇది.
 
ఇక రెండో ర‌కం వృద్ధుల విష‌యానికి వ‌స్తే... రైతు బంధు 59 ఏళ్ల వరకే వర్తిస్తుంది. అంటే 59 ఏళ్ల తరువాత రైతు వృద్దుడు అవుతాడు తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో. అందుకే అత‌నికి వ్య‌వ‌సాయం చేసే అర్హ‌త ఉండ‌దు. రైతు బంధు ప‌థ‌కానికి అర్హుడు కాడు.
 
ఇక మూడో ర‌కం వృద్ధులు... ప్ర‌భుత్వోద్యోగులు... త‌మ ఉద్యోగాల‌కు పదవి విరమణ చేసే వ‌య‌సు 61 ఏళ్ళు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు 61 ఏళ్ల తరువాత వృద్దులు అవుతారు తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో. 
 
ఇలా మూడు ర‌కాల వృద్ధాప్యాల‌ను తెలంగాణా ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌డంతో ఎవ‌రికి ఎపుడు వృద్ధాప్యం సంభ‌విస్తుందో తెలియ‌ని దుస్థితి ఏర్ప‌డుతోంద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments