Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలను పశువుల్లా అమ్మేస్తున్నారు... ఎక్కడ?

సంతలో పశువులను విక్రయించినట్టుగా అమ్మాయిలను అమ్మేస్తున్నారు. అమ్మాయిలను అమ్ముతున్నది వ్యభిచారగృహాలకు. అదీకూడా దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో.

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (13:20 IST)
సంతలో పశువులను విక్రయించినట్టుగా అమ్మాయిలను అమ్మేస్తున్నారు. అమ్మాయిలను అమ్ముతున్నది వ్యభిచారగృహాలకు. అదీకూడా దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో. జాతీయ నేర రికార్డుల సంస్థ (నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) వార్షిక నివేదికలో పచ్చినిజాన్ని వెల్లడించింది. 
 
అమ్మాయిలను అక్రమంగా తరలించి వ్యభిచార గృహాలకు విక్రయించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ నేర రికార్డుల సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ  విషయం బయటపడింది. దేశంలో అమ్మాయిల విక్రయంపై 8,057 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 229 కేసులున్నాయి. 
 
కాగా, ఉద్యోగాలిప్పిస్తామని ఆశ పెట్టి అమ్మాయిలను నమ్మించి అక్రమంగా తీసుకువెళ్లి వారిని వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదిలావుంటే ఈ యేడాది 314 మంది అమ్మాయిలను వ్యభిచార గృహాల నుంచి కాపాడారు రాష్ట్ర పోలీసులు.
 
2016వ సంవత్సరంలో అమ్మాయిల అక్రమరవాణ, విక్రయంపై హైదరాబాద్ నగరంలో 64 కేసులు నమోదయ్యాయి. మరో 76 మంది మహిళలను పోలీసులు వ్యభిచార రొంపి నుంచి రక్షించారని నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో నివేదికలు తెలుపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments