Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలను పశువుల్లా అమ్మేస్తున్నారు... ఎక్కడ?

సంతలో పశువులను విక్రయించినట్టుగా అమ్మాయిలను అమ్మేస్తున్నారు. అమ్మాయిలను అమ్ముతున్నది వ్యభిచారగృహాలకు. అదీకూడా దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో.

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (13:20 IST)
సంతలో పశువులను విక్రయించినట్టుగా అమ్మాయిలను అమ్మేస్తున్నారు. అమ్మాయిలను అమ్ముతున్నది వ్యభిచారగృహాలకు. అదీకూడా దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో. జాతీయ నేర రికార్డుల సంస్థ (నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) వార్షిక నివేదికలో పచ్చినిజాన్ని వెల్లడించింది. 
 
అమ్మాయిలను అక్రమంగా తరలించి వ్యభిచార గృహాలకు విక్రయించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ నేర రికార్డుల సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ  విషయం బయటపడింది. దేశంలో అమ్మాయిల విక్రయంపై 8,057 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 229 కేసులున్నాయి. 
 
కాగా, ఉద్యోగాలిప్పిస్తామని ఆశ పెట్టి అమ్మాయిలను నమ్మించి అక్రమంగా తీసుకువెళ్లి వారిని వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదిలావుంటే ఈ యేడాది 314 మంది అమ్మాయిలను వ్యభిచార గృహాల నుంచి కాపాడారు రాష్ట్ర పోలీసులు.
 
2016వ సంవత్సరంలో అమ్మాయిల అక్రమరవాణ, విక్రయంపై హైదరాబాద్ నగరంలో 64 కేసులు నమోదయ్యాయి. మరో 76 మంది మహిళలను పోలీసులు వ్యభిచార రొంపి నుంచి రక్షించారని నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో నివేదికలు తెలుపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments