Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర తొలి లోకాయుక్తగా సీహెచ్ రాములు

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (12:36 IST)
తెలంగాణ రాష్ట్ర తొలి లోకాయుక్తగా చింతపంటి వెంకట రాములు నియమితులయ్యారు. అలాగే, ఉప లోకాయుక్తగా ఒలిమినేని నిరంజన్ రావు ఎంపికయ్యారు. ఇక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ తొలి ఛైర్మన్‌గా జస్టిస్‌ గుండె చంద్రయ్య, సభ్యులుగా సెషన్స్‌ కోర్టు జిల్లా జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యుడిగా మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ మొయినుద్దీన్‌లను నియమిస్తూ ప్రభుత్వం గురువారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.
 
లోకాయుక్త, ఉప లోకాయుక్తల పదవీకాలం ఐదేళ్ల పాటు ఉంటుంది. మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల పదవీ కాలం మూడేళ్లపాటు ఉంటుంది. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌లను ఈ నెల 20నాటికి నియమించాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో నియామక కమిటీలు గురువారం ప్రగతి భవన్‌లో భేటీ అయ్యాయి. 
 
సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ఈ కమిటీల్లో శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంఐఎం శాసనసభాపక్ష ఉపనేత పాషాఖాద్రి, మండలిలో ఎంఐఎం పక్ష నేత జాఫ్రి ఉన్నారు. హక్కుల కమిషన్‌కు సంబంధించిన కమిటీలో అదనంగా హోంమంత్రి మహమూద్‌ అలీ ఉన్నారు. లోకాయుక్త, ఉప లోకాయుక్త, హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల పేర్లను ఈ కమిటీలు గవర్నర్‌ తమిళిసైకు పంపారు. ఆమె ఆమోదించడంతో ఉత్తర్వులు ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments