తెలంగాణలో కరోనా మహమ్మారి.. ఆరుగురు మృతి.. డీజీపీ ఆఫీసులో కూడా?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (13:01 IST)
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తెలంగామలో సోమవారం ఆరుగురు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌-19 బారిన పడి ప్రాణాలొదిలిన వారి సంఖ్య 88కు చేరింది. సడలింపుల తర్వాత జీహెచ్‌ఎంసీ బయట జిల్లాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. 
 
తాజాగా జీహెచ్‌ఎంసీలో 79 కేసులు రాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారు 434 మందిలో పాజిటివ్‌ అని తేలింది. రాష్ట్రంలో 2358 మందితో మొత్తం 2792కు పాజిటివ్‌ కేసులు చేరాయి. వీరిలో 1491 మంది కోలుకుని డిశ్చార్జి కాగా మిగిలిన 1213 మంది ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
రాష్ట్ర పోలీసు శాఖ హెడ్‌క్వార్టర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ) కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. లక్డీకాఫూల్‌లోని డీజీపీ కార్యాలయంలోని పరిపాలనా విభాగంలో ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు కార్యాలయ వర్గాలను బట్టి తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పిల్లలను వదిలేశాడు.. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు.. పవన్‌పై పూనమ్ ఫైర్

క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ .. ఇండస్ట్రీ అద్దం లాంటిది

స్పిరిట్ చిత్రంలో ప్రభాస్‌తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారా?

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments