Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైకు వెళ్ళనున్న సీఎం కేసీఆర్ - ఆదివారం ఉద్ధవ్‌తో లంచ్ మీటింగ్

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (20:27 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 20వ తేదీన ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై సాగిస్తున్న పోరాటంలో భాగంగా ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సమావేశమై లంచ్ మీటింగ్ జరుపుతారు.
 
ప్రధాని మోడీ, ఎన్డీయే సర్కారుపై సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన జాతీయ స్థాయి నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇందులోభాగంగా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులతో ఆయన ఫోనులో మాట్లాడారు. మాజీ ప్రధాని దేవెగౌడతోను ఫోనులో మాట్లాడారు. ఇపుడు ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కావాలని నిర్ణయించారు. 
 
అయితే, ఠాక్రే ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ ముంబైకు వెళ్ళనున్నారు. గత బుధవారం సీఎం కేసీఆర్‌కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసి.. బీజేపీపై సాగిస్తున్న పోరులో తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. "కేసీఆర్ జీ... మీ పోరాటం స్ఫూర్తిదాయకం. విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి ఇదే సరైన సమయం" అని ఈ సందర్భంగా ఠాక్రే వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments