Webdunia - Bharat's app for daily news and videos

Install App

వణికిపోతున్న తెలంగాణ - పడిపోయిన ఉష్ణోగ్రతలు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (11:37 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణాలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా చలి తీవ్రత పెరిగి జనం గజగజ వణికిపోతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. సాధారణం కంటే నాలుగు డిగ్రీల నుంచి ఆరు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. 
 
ఆదివారం తెల్లవారుజామున కుమరం భీం జిల్లా సిర్పూరులో అత్యల్పంగా 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఆదిలాబాద్‌లో 9.2, మెదక్‌లో 10, హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన నందనవనంలో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
ఈ సీజనులో ఇంత తక్కువ మోతాదులో ఈ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో మున్ముందు మరింత తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments