Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు.. కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (09:15 IST)
భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. పంజాబ్‌ సరిహద్దుల్లో ఇవి కనిపించాయి. దీంతో అప్రమత్తమైన భారత సరిహద్దు గస్తీ దళం (బీఎస్ఎఫ్) కాల్పులు జరిపాయి. ఓ డ్రోన్‌ను లక్ష్యంగా చేసుకుని 96 రౌండ్ల కాల్పులు జరిపినట్టు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో తోకముడిచిన పాక్ డ్రోన్లు తిరిగి తమ భూభాగంలోకి వెళ్లిపోయారు. 
 
కొద్దిసేపు కలకలం రేపిన ఈ రెండు డ్రోన్లలో తొలి డ్రోన్ పంజాబ్ సరిహద్దు ప్రాంతమైన గురుదాస్ పూర్ జిల్లా కాసోవాల్ ప్రాంతంలో కనిపించింది. ఆ వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు దానిపై కాల్పులు ప్రారంభించడంతో వెళ్లిపోయాయి. 
 
ఆ డ్రోన్ లక్ష్యంగా చేసుకుని ఏకంగా 96 రౌండ్ల కాల్పులు జరిపింది. 5 ఇల్యుమినేషన్ బాంబులను కూడా ప్రయోగించారు. ఆ తర్వాత డ్రోన్ కనిపించిన ప్రాంతంలో నిశితంగా తనిఖీ చేశారు. 
 
అదేవేధంగా అమృత్‌సర్ జిల్లాలోని చన్నా పఠాన్ ప్రాంతంలో కూడా మరో డ్రోన్ కనిపించింది. బీఎస్ఎఫ్ దళాలు దానిపై 10 రౌండ్ల కాల్పులు జరపడంతో ఈ డ్రోన్ కూడా తమ భూభాగంలోకి వెళ్లిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments