Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్, హోం క్వారెంటైన్లో...

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (19:42 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా స్వల్ప లక్షణాలు వున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం సీఎం హోం క్వారెంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కరోనా పరీక్షలు చేశామనీ, అందులో పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు సోమవారం సాయంత్రం ప్రధాన కార్యదర్శి ఇచ్చిన అధికారిక నోట్‌లో పేర్కొన్నారు.
 
ముఖ్యమంత్రికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, తన ఫామ్‌హౌస్‌లో హోం క్వారంటైన్లో ఉన్నారని ముఖ్య కార్యదర్శి తెలిపారు. వైద్యుల బృందం ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది.
 
 కాగా ఇటీవలే తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన చికిత్స చేయించుకుని నెగటివ్ రిపోర్టుతో బయటకు వచ్చారు. తాజాగా నాగార్జున ఉపఎన్నిక సమయంలో కేసీఆర్ భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఆయనకు అక్కడ కరోనా సోకి వుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 
 రాష్ట్ర రాజధానిలో 705 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ప్రక్కనే ఉన్న మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాలో వరుసగా 363, 336 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments