గవర్నమెంట్ స్కూల్‌లో చేరితే రూ.5 వేల నగదు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 20 జూన్ 2022 (10:12 IST)
ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ మాయాజాలం ముందు ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది. ఈ పాఠశాలలకు పునరుజ్జీవం కల్పించేందుకు ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. పైగా, విద్య కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుంది. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్‌లో చర్పించేందుకే మొగ్గు చూపుతున్నారు. 
 
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోధుమకుంటలో ప్రజాప్రతినిధులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి రూ.5 వేలు ఇస్తామంటూ సర్పంచి ఆకిటి మహేందర్‌రెడ్డి, ఉపసర్పంచి ఆంజనేయులు ప్రకటించారు.
 
అంతేకాకుండా, దాతల సాయంతో అన్ని వసతులతో పాటు పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. అంతేకాక విద్యార్థికి ఉచితంగా రెండు జతల యూనిఫామ్‌లు, బూట్లు, సాక్సులు, బస్‌పాస్‌ అందిస్తామని పేర్కొన్నారు. ప్రకటించిన నజరానాల వివరాలతో పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments