Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలకు - ఉపాధి కోల్పోయిన వారికి ఉచిత రేషన్

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (10:22 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన వారికితో పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రేషన్ జూన్, జూలై నెలల్లో ఇవ్వనుంది. జూన్ నెలలో 15 కేజీల బియ్యం, జులైలో 5 కేజీల బియ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 
పేదల ఆకలి తీర్చడంలో సీఎం కేసీఆర్‌ ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు ప్రస్తుతం ఇస్తున్న 35 కేజీలకు అదనంగా మరో 10 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు ప్రస్తుతం ఇస్తున్న 10 కిలోలకు అదనంగా మరో 10 కిలోలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 
 
ఆహారభద్రత కార్డు కలిగిన కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఎప్పటిలాగే ఇచ్చే 6 కిలోలకు మరో తొమ్మిది కలిపి 15 కిలోల బియ్యం ఇవ్వనున్నట్టు తెలిసింది. వచ్చే నెల ఇచ్చే బియ్యంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 87.42 లక్షల రేషన్‌ కార్డుదారులైన 2.79 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments