Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత విమానాలపై నిషేధం పొడగించిన ఫిలిప్పీన్స్

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (10:09 IST)
భారత్‌తో సహా ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం జూన్‌ 15వ తేదీ వరకు పొడగించింది. భార‌త్‌, పాక్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఒమన్‌, యూఏఈ నుంచి ప్రయాణికులపై నిషేధం పొడగించినట్లు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సోమవారం పేర్కొంది. 
 
కొవిడ్‌-19 జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సిఫారసు మేరకు ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలను పొడగించేందుకు అధ్యక్షుడు రోడ్రిగో ఆమోదం తెలిపారని ఆయన ప్రతినిధి హ్యారీ రోక్ చెప్పారు.
 
భారత్‌లో తొలిసారిగా గుర్తించిన బి.1.617 డబుల్‌ మ్యూటెంట్‌ వేరియంట్‌ నేపథ్యంలో ఇంతకుముందు ఏప్రిల్‌ 31 నుంచి మే 31 వరకు ఏడు దేశాలపై ఫిలిప్పీన్స్ నిషేధం విధించింది. ప్రస్తుతం కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు బ్యాన్‌ను పొడగించింది. 
 
ఇదిలావుండగా, ఫిలిప్పీన్స్‌లో నిన్న 6,684 కరోనా కేసులు రికార్డయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 12,30,301కు చేరుకుంది. వైరల్ వ్యాధితో మరో 107 మంది రోగులు మరణించడంతో.. మృతుల సంఖ్య 20,966కు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments