Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత విమానాలపై నిషేధం పొడగించిన ఫిలిప్పీన్స్

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (10:09 IST)
భారత్‌తో సహా ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం జూన్‌ 15వ తేదీ వరకు పొడగించింది. భార‌త్‌, పాక్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఒమన్‌, యూఏఈ నుంచి ప్రయాణికులపై నిషేధం పొడగించినట్లు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సోమవారం పేర్కొంది. 
 
కొవిడ్‌-19 జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సిఫారసు మేరకు ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలను పొడగించేందుకు అధ్యక్షుడు రోడ్రిగో ఆమోదం తెలిపారని ఆయన ప్రతినిధి హ్యారీ రోక్ చెప్పారు.
 
భారత్‌లో తొలిసారిగా గుర్తించిన బి.1.617 డబుల్‌ మ్యూటెంట్‌ వేరియంట్‌ నేపథ్యంలో ఇంతకుముందు ఏప్రిల్‌ 31 నుంచి మే 31 వరకు ఏడు దేశాలపై ఫిలిప్పీన్స్ నిషేధం విధించింది. ప్రస్తుతం కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు బ్యాన్‌ను పొడగించింది. 
 
ఇదిలావుండగా, ఫిలిప్పీన్స్‌లో నిన్న 6,684 కరోనా కేసులు రికార్డయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 12,30,301కు చేరుకుంది. వైరల్ వ్యాధితో మరో 107 మంది రోగులు మరణించడంతో.. మృతుల సంఖ్య 20,966కు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments