Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుపూజోత్సవం, పూజలందుకోవాల్సిన గురువు బైక్ మెకానిక్‌గా...

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (15:12 IST)
ఉన్నత చదువులు చదివిన ఆ ఉపాధ్యాయుడు గురు పూజోత్సవం రోజున గురువు గౌరవాన్ని అందుకోవాలి కానీ కరోనా పుణ్యాన ఉపాధి కోల్పోయిన గురువు, కుటుంబ పోషణ కోసం బైక్ మెకానిక్‌గా మారాల్సిన దుస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది.
 
ఖమ్మం జిల్లా మధిరకు చెందిన  రవీందర్ ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాదులో ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ప్రతి ఏడాది గురుపూజోత్సవం రోజున విద్యార్థులు వారి తల్లిదండ్రులు కళాశాలలో శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించేవారు. ఉపాధ్యాయుడుగా ఆరోజున పొందే తృప్తి జీవితంలో మరుపురాని జ్ఞాపకంలా ఉండేది.
 
ఇప్పుడు కరోనా పుణ్యాన కళాశాలలు మూతపడి ఉపాధి కోల్పోయి, కుటుంబ పోషణ కోసం ఆత్మాభిమానాన్ని పక్కనపెట్టిన ఆ గురువు బైక్ మెకానిక్ మారాడు. గురుపూజోత్సవం రోజున ఉపాధ్యాయుని ఈవిధంగా చూడాల్సి రావడం విద్యార్థులు వారి తల్లిదండ్రులను కలచివేస్తోంది. కరోనా మహమ్మారి తొలగిపోయి మరలా తిరిగి మంచి రోజులు రావాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments