Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుపూజోత్సవం, పూజలందుకోవాల్సిన గురువు బైక్ మెకానిక్‌గా...

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (15:12 IST)
ఉన్నత చదువులు చదివిన ఆ ఉపాధ్యాయుడు గురు పూజోత్సవం రోజున గురువు గౌరవాన్ని అందుకోవాలి కానీ కరోనా పుణ్యాన ఉపాధి కోల్పోయిన గురువు, కుటుంబ పోషణ కోసం బైక్ మెకానిక్‌గా మారాల్సిన దుస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది.
 
ఖమ్మం జిల్లా మధిరకు చెందిన  రవీందర్ ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాదులో ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ప్రతి ఏడాది గురుపూజోత్సవం రోజున విద్యార్థులు వారి తల్లిదండ్రులు కళాశాలలో శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించేవారు. ఉపాధ్యాయుడుగా ఆరోజున పొందే తృప్తి జీవితంలో మరుపురాని జ్ఞాపకంలా ఉండేది.
 
ఇప్పుడు కరోనా పుణ్యాన కళాశాలలు మూతపడి ఉపాధి కోల్పోయి, కుటుంబ పోషణ కోసం ఆత్మాభిమానాన్ని పక్కనపెట్టిన ఆ గురువు బైక్ మెకానిక్ మారాడు. గురుపూజోత్సవం రోజున ఉపాధ్యాయుని ఈవిధంగా చూడాల్సి రావడం విద్యార్థులు వారి తల్లిదండ్రులను కలచివేస్తోంది. కరోనా మహమ్మారి తొలగిపోయి మరలా తిరిగి మంచి రోజులు రావాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments