Webdunia - Bharat's app for daily news and videos

Install App

శానిటైజర్లు వాడుతున్నారా? జాగ్రత్త.. లేకుంటే ఇలాంటి ప్రమాదం తప్పదు..?

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (15:05 IST)
కరోనా వైరస్ కారణంగా శానిటైజర్లు వాడటం తప్పనిసరిగా మారింది. అయితే శానిటైజర్లకు మండే గుణం వుండటంతో కాస్త జాగ్రత్తగా వుండాలని వైద్యులు అంటున్నారు. అందుచేత ఆ ద్రావణంతో కాసింత జాగ్రత్తగా మెలగాలి. లేకుంటే ప్రమాదమనేందుకు ఈ ఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో కేట్‌వైడ్‌ నివసిస్తోంది. 
 
మొన్న ఆదివారం ఎప్పటిలాగే తన చేతులకు శానిటైజర్‌ రాసుకుంది. రాసుకున్నాక క్యాండిల్‌ వెలిగించడం కోసం అగ్గిపుల్ల గీసింది. అదే ఆమె చేసిన తప్పిదం.. చేతికి మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా చేతికి మంటలు అంటుకోవడంతో భీతిల్లిన ఆమె వెనక్కి మళ్లింది. అలా ఆమె రెండో తప్పు చేసింది. 
 
ఎందుకంటే వెనకాలే శానిటైజర్‌ బాటిల్‌ ఉంది. అది కాస్త భగ్గున మండింది. మండటమే కాదు బాంబులా పేలింది. దాంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఆ మంటలకు ఆమె ముఖం, చేతులు, కాళ్లు కాలాయి. ఆ టైమ్‌లో ఇంట్లో కేట్‌వైడ్‌ కూతుళ్లు ఉన్నారు కాబట్టి సరిపోయింది. వారు వెంటనే స్థానికుల సాయంతో తల్లిని హాస్పిటల్‌లో చేర్చారు.. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. అందుకే శానిటైజర్లు వాడేటప్పుడు జాగ్రత్త వహించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments